బాలుడి ప్రాణం నిలబెట్టిన మంత్రి కొప్పుల..

by  |
బాలుడి ప్రాణం నిలబెట్టిన మంత్రి కొప్పుల..
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపురంనకు చెందిన బ్రహ్మయ్య కుమారుడు శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తన ఆర్థిక పరిస్థితిని వివరించారు.

వెంటనే స్పందించిన మంత్రి కొప్పుల ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు శ్రీనివాస్ దరఖాస్తును పంపగా మెరుగైన వైద్య సేవల కోసం రూ.4 లక్షల ఎల్‌వోసి మంజూరు చేశారు. గురువారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆ ధృవపత్రాన్ని బాధిత కుటుంబానికి అందించారు మంత్రి కొప్పుల. ఆర్థిక సాయం అందజేసినందుకు గాను ప్రభుత్వానికి, కొప్పుల ఈశ్వర్‌కు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed