మహాద్భుతమైన పథకం దళిత బంధు: కొప్పుల ఈశ్వర్

by  |
మహాద్భుతమైన పథకం దళిత బంధు: కొప్పుల ఈశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితులంతా ఆత్మగౌరవంతో తలెత్తుకునే మహాద్భుతమైన పథకం దళితబంధు అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‎కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సభ విజయవంతమైందన్నారు. దళిత జాతి సముద్ధరణకు మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. పథకంను ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు సాగుతుందని సీఎం చెప్పడంతో దళిత జాతి హర్షామోదాలు వ్యక్తం చేస్తుందని అన్నారు. సభకు అంచనాలకు మించి లక్షన్నర మందికి పైగా దళితులు తరలివచ్చారన్నారు. సభ విజయవంతానికి సహకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed