వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : వంగవీటి రాధాకృష్ణ బంగారం అని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో ఆదివారం దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికలు పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని, రాధా, వంశీలు ముగ్గురూ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా నాకు తమ్ముడు. నేను వైసీపీలో ఉన్నాను, రాధ టీడీపీలో ఉన్నాడు అనుకుంటా?. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా.. పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు. బంగారం లాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనె బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుంది.. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడు. రాధాను అందరూ పెద్దమనుషుతో దీవించాలని.. రాధాకు మంచి భవిష్యత్‌ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed