చంద్రబాబుపై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు

by  |
చంద్రబాబుపై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : చంద్రబాబు నాయుడు టీడీపీకి పట్టిన శని అంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం జరిగిందో తెలియక జనం పిట్టల్లా పడిపోతుంటే.. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం నీచత్వమని కొడాలి మండిపడ్డారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలైనట్లు తెలిపారు. వీరిలో 243 కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. 16 మందిని విజయవాడకు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 183 మంది చికిత్స పొందుతున్నట్లు మంత్రి కొడాలి నాని వెల్లడించారు.

Next Story