- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ‘ఉంచితే అమరావతినే రాజధానిగా ఉంచాలి. లేకుంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలి.’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శుక్రవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నకల్లో టీడీపీ బంపర్ మెజార్జీతో గెలిస్తే.. రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్లదని విమర్శించారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు, గద్దె రామ్మోహన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచించారు. రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు వెళ్లడం జగన్కు కొత్తేమి కాదని తెలిపారు. వైసీపీ పుట్టిందే రాజీనామాలతో, ఉప ఎన్నికలతో అని గుర్తుచేశారు. జనరల్ ఎన్నికలకు వెళ్లాలంటేనే వణికిపోయే టీడీపీ ఉప ఎన్నికల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.