హీరో రామ్‌కు మంత్రి కొడాలి నాని సలహా

by  |
హీరో రామ్‌కు మంత్రి కొడాలి నాని సలహా
X

దిశ, వెబ్‌డెస్క్: రమేశ్ ఆసుపత్రి ఘటనపై హీరో రామ్ చేసిన ట్వీట్లపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం రమేశ్ ఆసుపత్రి ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం వెనుకు టీడీపీ బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ ఉన్నారని సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహరంపై హీరో రామ్.. రమేశ్ మాట వినకుండా తన పని తాను చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. సీఎం జగన్ పాలన కులాలకు అతీతమన్నారు. ప్రత్యేకించే ఏ కులంపై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.

Next Story