శ్రీనివాస్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి

by  |
శ్రీనివాస్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట బండి సంజయ్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒంటికి నిప్పంటించుకొని శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను యశోద ఆస్పత్రికి తరలించారు. అంతేగాకుండా విషయం తెలిసిన బండి సంజయ్ వైద్యులతో మాట్లాడి మెరుగైన అందించాలని కోరారు. దీంతో యశోద ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కార్యకర్తలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు అని సూచించారు.


Next Story

Most Viewed