‘ఆయనకు తెలిసిన జిమ్మిక్కులు మాకు తెలియదు’

by  |
‘ఆయనకు తెలిసిన జిమ్మిక్కులు మాకు తెలియదు’
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. యనమలకు తెలిసిన జిమ్మిక్కులు, దొంగ లెక్కలు తమకు తెలియదని ఆయన చురకలు అంటించారు. తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్ర ద్వారా సున్నా వడ్డీ పథకం రైతులకు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. రేపటి నుంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ‘ఈ’ పంట ద్వారా ఏ గ్రామంలో ఏ పంట వేస్తున్నారో సమాచారం సేకరిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కౌలు రైతులకు అబ్ధి చేకూరుతుందని మంత్రి కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed