సినిమా థియేటర్ లో సందడి చేసిన తెలంగాణ మంత్రి..

by  |
సినిమా థియేటర్ లో సందడి చేసిన తెలంగాణ మంత్రి..
X

దిశ, సూర్యాపేట: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి థియేటర్ లో సందడి చేశారు. బుధవారం సూర్యాపేట లోని ఈశ్వర్ మూవీ మహల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తెరకెక్కించిన ‘రైతన్న’ చిత్రాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. రైతన్నల జీవితాలను ఆవిష్కరిస్తూ తీసిన చిత్రం అందరు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని మంత్రి తెలిపారు. పేదల కష్టాలు, రైతుల బాధలను ఆర్. నారాయణ మూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని మంత్రి కొనియాడారు.



Next Story