మూడు రోజుల్లో కొత్త గేట్లు

by  |
మూడు రోజుల్లో కొత్త గేట్లు
X

దిశ, నల్లగొండ: మూసీకి మూడు రోజుల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. ఇకపై మూసీ ప్రాజెక్టులో చుక్క నీటిని వృథా కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా మూసీని పట్టించుకోకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారని.. లీకేజీలతో నీళ్లన్ని కృష్ణాలో కలసి వృథాగా పోయాయని అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మూసీ ప్రాజెక్ట్‌ను సందర్శించి కొత్త గేట్ల అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తరువాత రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మీదనే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించామన్నారు. తాజాగా జరుగుతున్న మరమ్మతులతో మూసీ ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు.



Next Story

Most Viewed