‘నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్’

by  |
‘నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్’
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్-బొప్పారం గ్రామంలో రూ.1200 కోట్లతో నిర్మించిన 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి జగదీష్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుతో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కానుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story