స్వయంగా ట్రాక్టర్ నడిపి శోభయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

by  |
స్వయంగా ట్రాక్టర్ నడిపి శోభయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ పోస్టాఫీసు వద్ద ఆదివారం జరిగిన భజన మందిరం వినాయకుని లడ్డూ వేలంపాట మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ లడ్డూని దేవరశెట్టి గోవర్దన్ 1,01,116 లకు వేలంపాట పాడి లడ్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా దేవరశెట్టి గోవర్దన్ కు మంత్రి జగదీష్ రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం భజన మందిరం వినాయకునికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోస్టాఫీసు నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు భజన మందిరం వినాయకుని వాహనాన్ని మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నడిపి, ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరిపించారు. స్వయంగా మంత్రి ట్రాక్టర్ నడపడం పలువురుని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్,జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ తహెర్ పాషా, ఆకుల కవిత లవకుశ, వెంపటి సురేష్, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీ నెమ్మది భిక్షం, కమిషనర్ రామానుజులు రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వైవి, ఉప్పల ఆనంద్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబు, గుడిపూడి వెంకటేశ్వర రావు, మొరిశెట్టి శ్రీనివాస్, చల్లా లక్ష్మికాంత్, ఉత్సవ కమిటీ సభ్యులు రంగరాజు రుక్మారావు, చల్లమల్ల నర్సింహ్మ, మంచాల రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed