నోముల నర్సింహ్మయ్య ప్రజలకు ఎనలేని సేవ చేశారు: మంత్రి జగదీష్ రెడ్డి

by  |
నోముల నర్సింహ్మయ్య ప్రజలకు ఎనలేని సేవ చేశారు: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, హాలియా: గత ఏడాది డిసెంబర్ 1న మరణించిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిడమనూరు మండలం సమీపంలో ఏర్పాటు చేసిన స్మృతి వనంలో నోముల నర్సింహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే గుండెబొయిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాల ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరై ఇద్దరి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు నోముల నర్సింహ్మయ్య ప్రజలకు ఎనలేని సేవ చేశారని, అనుకోని పరిస్థితుల్లో గత సంవత్సరం డిసెంబర్ 1న అకాల మరణం చెంది నియోజకవర్గ ప్రజలను శోకసంద్రంలో ముంచారన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇచ్చిన హామీలను ఆయన కుమారుడు నోముల భగత్ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భాస్కరరావు, భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రామచంద్రనాయక్, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed