పులి దాడి కుటుంబాలకు మంత్రి పరామర్శ

by  |
పులి దాడి కుటుంబాలకు మంత్రి  పరామర్శ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పులుల దాడుల్లో మరణించిన కుటుంబసభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. పెంచికల్‌పేట మండలం కొండపల్లి, దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోనప్ప, జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, కవ్వాల్‌ టైగర్ రిజర్వ్ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌, తదితరులు ఉన్నారు.

Next Story