వాకింగ్‌కు వెళ్లి మొక్కలు నాటిన మంత్రి

by  |
వాకింగ్‌కు వెళ్లి మొక్కలు నాటిన మంత్రి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న గండి రామన్న ఎకో పార్కులో మార్నింగ్ వాక్ చేశారు. సుమారు గంటకు పైగా మార్నింగ్ వాక్ తో పాటు శారీరక వ్యాయామం చేశారు. అనంతరం అదే పార్కులో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, కవ్వాల్ టైగర్ జోన్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సీపీ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు కూడా హరిత హారం కార్యక్రమంలో భాగంగా మంత్రితో కలిసి మొక్కలు నాటారు.



Next Story

Most Viewed