ఇది ఆ గ్రామాలకు ఉపయోగపడుతది: ఇంద్రకరణ్ రెడ్డి

by  |
ఇది ఆ గ్రామాలకు ఉపయోగపడుతది: ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని బెల్లాల గ్రామంలో రైతుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ చేతులు ప్రారంభించారు. ముందుగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరాఫరా చేస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వారు అన్నారు. చిట్యాల, బెల్లాల, పెద్ద బెల్లాల, మొర్రిగూడెం తదితర గ్రామాలకు ఈ సబ్ స్టేషన్ ఉపయోగపడుతుందని చెప్పారు.

Next Story

Most Viewed