సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ పర్యటన

by B.Srinivas |   (  Updated:2020-04-06 01:30:03  IST  )

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి హరీశ్‌రావు సోమవారం పర్యటించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన వాడు కావటంతో స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా బాధితునికి అందుతున్న వైద్యం గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులతో మంత్రి మాట్లాడారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని, కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి [&hellip;]</p>

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ పర్యటన
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి హరీశ్‌రావు సోమవారం పర్యటించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన వాడు కావటంతో స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా బాధితునికి అందుతున్న వైద్యం గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులతో మంత్రి మాట్లాడారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని, కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , ఎంపీ కొత్త ప్రభాకర్ లు ఉన్నారు.

Tags:Minister Harish rao,visit,Sangareddy,corona patient,Residency Area

Next Story