- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జమ్మికుంట : టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఘనుడు ఈటల రాజేందర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం రాత్రి జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధూమ్, ధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి, బండి సంజయ్, జితెందర్ రెడ్డిలు బాగా తిరుగుతున్నరు. జమ్మికుంట కోసం ఒక్క మాట చెప్పిండ్రా.. ఎస్సీల కోసం చెప్పారా.. బీసీల కోసం చెప్పారా.. మైనార్టీల కోసం చెప్పారా.. ప్రజల కోసం అయినా చెప్పారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణానికి మెడికల్ కాలేజీ రావాలంటే గెల్లు శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.