నేను హరీష్‌రావును .. మినిస్టర్ ని… !!

by  |
నేను హరీష్‌రావును .. మినిస్టర్ ని… !!
X

దిశ ప్రతినిధి, మెదక్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడిన బాధితులు ధైర్యంగా ఉండేలా ఏ జిల్లాకు వెళ్లిన, ఏ నియోజకవర్గానికి వెళ్లినా కరోనా కేసు ఉందంటే చాలు వారికి ఆత్మవిశ్వాసం నింపుతూ అధైర్య పడకుండా నేను ఉన్నాను అంటూ మంత్రి హరీశ్ రావు భరోసా ఇస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావు జిన్నారం మండల కేంద్రంలో కారులో వెళుతున్న క్రమంలో అక్కడే ఉన్న ఏఎన్ఎం నర్సులలను పలకరించారు. ” మీ ఊరిలో కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా.. ? ఉంటే ఎన్ని ఉన్నాయ్..? హోం ఐసోలేషన్ లో ఉన్న వారి దగ్గరికి వెళుతున్నారా.. ? వారికి మందులు ఇస్తున్నారా…? ” అని ఆరా తీశారు. ఒక పేషంట్ కి ఫోన్ కలపండి అని ఏఎన్ఎంల ద్వారా దుర్గా అనే కరోనా పేషంట్ కు ఫోన్ చేశారు. ఆ పేషెంట్ కొడుకు ఫోన్ మాట్లాడటంతో… ” నేను హరీష్ రావును.. మినిస్టర్ ని అని చెబుతూ.. అమ్మ మంచిగా అయిందా…. డాక్టర్లు పట్టించుకుంటున్నారా… !! అమ్మ ఆరోగ్యంగా ఉందా.. వైద్య సిబ్బంది వస్తున్నారా…! మందులు ఇస్తున్నారా…ఎన్ని సార్లు వచ్చారు అని అడిగి తెసుకున్నారు. దీంతో అతను వస్తున్నారు సార్.. ఫోన్ కూడా చేస్తున్నారు సార్.. అమ్మ ఇప్పుడు మంచిగా అయింది సార్.. అంటూ సమాధానం ఇచ్చారు. అధైర్యపడకండి.. ఆందోళన చెందకండి అండగా ఉంటామని వారిలో ఆత్మవిశ్వాసం నింపి భరోసానిచ్చారు.

Next Story