నిర్వాసితులను గుండెల్లో పెట్టి చూసుకుంటాం…

by  |
నిర్వాసితులను గుండెల్లో పెట్టి చూసుకుంటాం…
X

దిశ గజ్వెల్:
గోదావరి జలాల కోసం త్యాగాలకు సిద్ధమంటూ ముందున్నది, తెరాస గెలుపు కోసం నేడు తమను ఆహ్వానించి మళ్ళీ ఏకగ్రీవానికి సిద్ధమైంది లక్ష్మపూర్ గ్రామస్తులేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ ఓటంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని మంత్రి హరీశ్ రావుకు మల్లన్న సాగర్ భూ నిర్వాసిత లక్ష్మీపూర్ గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్‌, బీజేపీ వాళ్ళవి రెచ్చగొట్టే పనులేననీ అన్నారు. దేశంలో అనేక చోట్ల ఊర్లు మునిగాయనీ, కానీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చింది కేవలం తెరాస పార్టీనే అని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్వాసితుల కోసం కోకాకోలా వంటి పెద్ద పెద్ద కంపెనీలను తెచ్చి జీవనోపాధి కల్పిస్తామని నిర్వాసితులకు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed