‘ఏం ఐతది అనుకుంటాం.. అయ్యాక బాధపడుతాం’

by Shyam |

<p>దిశ, మెదక్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. ‘అతిగా భయపడొద్దు.. రాదని నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రతిఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. గోరు వెచ్చని నీళ్లు తాగాలని దీంతో కరోనాను దరిచేరకుండా అరికట్టొచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్ని బయటకి పంపొద్దని, [&hellip;]</p>

‘ఏం ఐతది అనుకుంటాం.. అయ్యాక బాధపడుతాం’
X

దిశ, మెదక్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. ‘అతిగా భయపడొద్దు.. రాదని నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రతిఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. గోరు వెచ్చని నీళ్లు తాగాలని దీంతో కరోనాను దరిచేరకుండా అరికట్టొచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్ని బయటకి పంపొద్దని, యువత అవసరం లేని పనులకు బయటకు వెళ్లొద్దని సూచించారు. ‘ఏం ఐతది అనుకుంటాం, కానీ వైరస్ సోకితే బాధపడుతాం’ అని మంత్రి హరీశ్ సూచించారు.

Next Story