దుబ్బాకలో టీఆర్ఎస్‌దే విజయం : హరీశ్ రావు

by  |
Minister Harish Rao
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక నిజయోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు కరోనాను కూడా లెక్కచేయకుండా ఓటు వినియోగించుకున్నారని వెల్లడించారు. అంతేగాకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన, ఎస్ఈసీ, పోలీసులకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. దుబ్బాకలో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ అబద్దపు ప్రచారం చేసిందని అన్నారు.

Next Story