మొక్కజొన్న సాగుపై హరీశ్‌రావు సమీక్ష

by  |
మొక్కజొన్న సాగుపై హరీశ్‌రావు సమీక్ష
X

దిశ, మెదక్: మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌‌లో కూరగాయలు, మొక్కజొన్న సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1200 ఎకరాల్లో మొక్కజొన్న పంటల సాగు కోసం రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజంమీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, అరబిందో, బేయర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed