హోలీ సంబురాల్లో మంత్రి హరీశ్ రావు

by  |
హోలీ సంబురాల్లో మంత్రి హరీశ్ రావు
X

దిశ, మెదక్: హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు.

tags : Minister Harish Rao, participated in the Holi celebrations, siddipet, Municipal Chairmen

Next Story

Most Viewed