అప్పుడు రామాలయం… ఇప్పుడు వెంకటేశ్వరాలయం

by  |
అప్పుడు రామాలయం… ఇప్పుడు వెంకటేశ్వరాలయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టే ముందు మంత్రి తన్నీరు హరీష్​రావు నగరంలోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు గురువారం ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టానికి బయల్దేరారు. మంత్రి హరీష్​రావు 2020‌‌–21 రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన రామాలయానికి వెళ్లి పూజలు చేశారు. కొండాపూర్​ వసంత వ్యాలీ సమీపంలోని రామాలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన అనంతరం స్పీకర్​ పోచారానికి బడ్జెట్​ కాపీని అందించి ప్రవేశపెట్టారు. ఈసారి మాత్రం ఆలయాన్ని మార్చారు. కారణాలేమైనా… గతంలో శ్రీరామున్ని దర్శనం చేసుకుని… ఇప్పుడు మాత్రం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజలు చేసి అసెంబ్లీకి వచ్చి తొలి కాపీని అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డికి అందించారు.



Next Story

Most Viewed