హైదరాబాద్‌లో నిర్మించేలా చర్యలు తీసుకుంటా

by Shyam |   (  Updated:2020-08-24 06:24:14  IST  )

<p>దిశ, సిద్దిపేట: రాష్ట్రంలో మొదటి మోచి భవనాన్ని సిద్ధిపేటలో నిర్మాణం చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరగడం&#8230; మోచి సంక్షేమ సంఘానికే గర్వకారణం అన్నారు. సిద్ధిపేట పట్టణంలోని నర్సాపూర్ 8వ వార్డులో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; అన్ని చోట్ల సంఘ నిర్మాణాలు చేపట్టేందుకు మార్గం వచ్చిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి&#8230; హైదరాబాద్‌లో మోచి సంక్షేమ భవనం [&hellip;]</p>

హైదరాబాద్‌లో నిర్మించేలా చర్యలు తీసుకుంటా
X

దిశ, సిద్దిపేట: రాష్ట్రంలో మొదటి మోచి భవనాన్ని సిద్ధిపేటలో నిర్మాణం చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరగడం… మోచి సంక్షేమ సంఘానికే గర్వకారణం అన్నారు. సిద్ధిపేట పట్టణంలోని నర్సాపూర్ 8వ వార్డులో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని చోట్ల సంఘ నిర్మాణాలు చేపట్టేందుకు మార్గం వచ్చిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి… హైదరాబాద్‌లో మోచి సంక్షేమ భవనం నిర్మాణం జరిగేలా చొరవ తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాని వారికి, వెంటనే అందేలా చొరవ చూపుతానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Next Story