చేసిందే చెపుదాం…చెప్పేదే చేద్దాం…..

by  |
చేసిందే చెపుదాం…చెప్పేదే చేద్దాం…..
X

దిశ,సిద్దిపేట:
మనం చేసిందే చెప్పి ,చెప్పేదే చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతోపాటు ఎదుటి పార్టీల గోబెల్స్ ప్రచారాలను తిప్పి కొట్టే దిశగా పని చేయాలని దుబ్బాక సోషల్ మీడియా ఇంఛార్జ్‌లకు మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేటలో సోషల్ మీడియా ఇంఛార్జ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో అసత్య ప్రచారాలను గోబెల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్నాయని ఆయన అన్నారు. అలాంటి అసత్యాలను తిప్పి కొట్టాలని వారికి సూచించారు. ఆ పార్టీలు పది తప్పుడు ప్రచారాలను చేస్తే, మనం చేసిన వంద మంచి పనులను ప్రజల ముందు పెడదామని అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చే గొట్టే విధంగా ఆ పార్టీలు మాట్లాడుతూ అసత్యాలను చెబుతూ ఉంటాయని తెలిపారు. కానీ మనం ఆచి తూచి అడుగు వేస్తూ ప్రజల్లో వాస్తవాలను ప్రచారం చేద్దామన్నారు.

Next Story

Most Viewed