చెరుకు శ్రీనివాస్‎రెడ్డిపై మంత్రి ఆగ్రహం

by  |
MInister Harish rao
X

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‎ నేత దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడంపై శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే మంచివాళ్లం.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లమా అని ప్రశ్నించారు. ఓపిక పడితే మంచిస్థాయి కల్పిస్తామని శ్రీనివాస్ రెడ్డికి చెప్పినా వినలేదన్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోసమే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో లక్ష ఇళ్లకు బిల్లును ప్రవేశపెట్టామని.. ఎవరి స్థలాల్లో వారికి ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed