మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

by  |
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
X

దిశ, మెదక్: సిద్ధిపేట నియోజకవర్గంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంత్రి హరీశ్ రావు ఆదివారం కలిసి పరామర్శించారు. వంగ గాల్ రెడ్డి తనయుడు వంగ నిరంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు గాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబీకులను ఓదార్చారు. అనంతరం సిద్ధిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గూడూరి ఆగదాసు ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు. అదేవిధంగా భారత్ నగర్ లో సిద్ధిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడవేర్గు ధర్మయ్య కుటుంబీకులను పరామర్శించారు. ధర్మయ్య సేవలను గుర్తు చేస్తూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంటా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story