‘ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు’

by  |
Minister Harish Rao
X

దిశ సిద్దిపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతరత్న డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం సిద్ధిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని మంత్రి వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed