పోలీసుల త్యాగాలు మరువలేం : జగదీశ్ రెడ్డి

by  |
పోలీసుల త్యాగాలు మరువలేం : జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నివాళ్లు అర్పించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పోలీసుల సేవలును గుర్తుకుచేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వాహణలో పోలీసుల త్యాగం మరువలేనిదన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, ఎస్సీ రంగనాథ్, కలెక్టర్, జెడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed