క్వాలిటీ వార్తలకు కేరాఫ్ 'దిశ' :గంగుల

by  |
క్వాలిటీ వార్తలకు కేరాఫ్ దిశ :గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ: క్వాలిటీ వార్తలకు కేరాఫ్‌గా ‘దిశ’ పత్రిక తయారైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని మీ సేవా కేంద్రంలో దిశ 2021 సంవత్సరం క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రామాణికతలతో కూడిన వార్తలు పబ్లిష్ చేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఇలాంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. పత్రికా రంగంలోకి దూసుకుపోతున్న ‘దిశ’ పత్రికను మంత్రి గంగుల అభినందించారు.

Next Story

Most Viewed