ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ నోరు జారిన మంత్రి గంగుల కమలాకర్

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ నోరు జారిన మంత్రి గంగుల కమలాకర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ నోరు జారారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కరీంనగర్ రూరల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… ఆసరా ఫించన్లు ఇచ్చి ఆదుకున్నందుకు ఆశీర్వదించాలా వద్దా అని అడిగారు. కడుపు నిండా భోజనం పెట్టిన వారి కడుపు సల్లగుండాలని దీవెనార్తులు పెడ్తాం కదా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబుకు దీవెనలు అందించాలి కదా అని మంత్రి గంగుల అన్నారు. ఆ తర్వాత తన పొరపాటును గ్రహించి కేసీఆర్‌ను దీవించాలని కోరారు. టీడీపీని వీడి పదేళ్లు కావొస్తున్నా చంద్రబాబు మాత్రం.. మంత్రి గంగుల కమలాకర్ మదిలోనే గూడు కట్టుకుని ఉన్నాడా అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బ్రేకింగ్: కత్తి మహేష్ కన్నుమూత

Next Story

Most Viewed