నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను : ఈటల

by  |
Minister Etela Rajender
X

దిశ, వెబ్‌బెస్క్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అన్నారు. అంతేగాకుండా శనివారం నుంచి పోలీసు శాఖకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అధునాతన ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలు పెడతామని అన్నారు. ప్రస్తుతం 65 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని.. కేవలం హెల్త్ సబ్జెక్ట్‌పైనే మాట్లాడతానని అన్నారు.



Next Story

Most Viewed