రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి ఈటల..

by  |
రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి ఈటల..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులకు మంత్రి ఈటల రాజేందర్ శుభవార్త చెప్పారు. రైతులు పండించే ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ఈటల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. రాష్ట్రంలో మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేడు కరీంనగర్​జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్‌ గ్రామంలో రైతు వేదికను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో పెట్టబడులు తగ్గి, మంచి పంటలను పండించేందుకు ఈ రైతు వేదికలు పరిశోధన కేంద్రాలుగా ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. రైతులకు ఈ వేదికలను అంకితం ఇస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, కరెంట్‌ కోసం నానా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు కరెంట్ ఇబ్బందులు తగ్గినట్టు తెలిపారు.



Next Story

Most Viewed