ప్రేమేంద‌ర్‌రెడ్డిపై దాడి చేయలే : ఎర్రబెల్లి

by  |
errabelli dayakar rao
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిపై దాడి ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రేమేందర్‌రెడ్డి బీజేపీ కండువాతో పోలింగ్ బూత్‌లోకి వెళ్తుంటే గులాబీ శ్రేణులు అడ్డుకున్నారని.. ఎవరిపై తాము దాడి చేయలేదని ఎర్రబెల్లి చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదైందని మంత్రి తెలిపారు. ఇది చరిత్రలో రికార్డు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగలేదన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.


Next Story

Most Viewed