కేసీఆర్ వల్లే ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తింపు: మంత్రి సత్యవతి రాథోడ్

by  |
కేసీఆర్ వల్లే ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తింపు: మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ,మహబూబాబాద్ టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడిలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంగన్వాడి టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం తన వాటాగా ఇస్తుంటే.. కేంద్రం పావులా వంతు మాత్రమే ఇస్తుందన్నారు. అంతే కాకుండా కోవిడ్ సమయంలో తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా అద్భుత సేవలు అందించారన్నారు. వారిని కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కేంద్రాన్ని స్వయంగా తాను కోరారన్నారు. అందువల్లే నేడు దేశ వ్యాప్తంగా అంగన్వాడీలకు 50 లక్షల రూపాయల బీమా వర్తించింది అని చెప్పారు.

అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అంగన్వాడీలకు నేత చీరలు అందిస్తున్నాం అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి మంత్రి నేతచీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలుకు చీరలు ఇస్తున్నామన్నారు.

గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బలామృతంతో కూడిన పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్వాడీల జీతాలు పెంచినప్పుడి కేంద్రం వారి వాటా పెంచకున్నా, సీఎం కేసీఆర్ మొత్తం వాటా పెంచి 30 శాతం పి ఆర్ సి ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, అధికారులు సీతా మహాలక్ష్మీ డెబోరా, ఉష, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed