జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

by  |
జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
X

దిశ, హైదరాబాద్: సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (HUJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు బియ్యం, నూనె, పప్పులు, చక్కెర ఇతరత్రా సరుకులను అందజేశారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, చేయూతనందించడం పట్ల హెచ్‌యూజే అధ్యక్షుడు చంద్రశేఖర్ జర్నలిస్టుల తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: corona effect, HUJ, chandrashekhar, talasani, rice distribution


Next Story

Most Viewed