స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమే !

by  |
స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమే !
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్ధమేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఎన్నికలు అంటున్నారని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లిన టీడీపీ నేతలను, హోటల్‌లో కలిచే అధికారిని ఎలా విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఎస్ఈసీ సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నామని, పార్టీ నిర్ణయం.. ప్రభుత్వ నిర్ణయం వేరుగా ఉండదన్నారు.


Next Story

Most Viewed