వాటిని ప్రభుత్వం ప్రోత్సహించదు : అవంతి

by  |
వాటిని ప్రభుత్వం ప్రోత్సహించదు : అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోలు ఏర్పాటు చేస్తున్నారని వస్తున్న ప్రచారాలపై మంగళవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అవన్నీ అవాస్తవాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా కార్యకలాపాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదు అని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు.



Next Story