‘త్వరలోనే పోలవరం పూర్తి చేస్తాం’

by  |
‘త్వరలోనే పోలవరం పూర్తి చేస్తాం’
X

దిశ, వెబ్‌డెస్క్: గత పాలకులు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా, పూర్తి నిర్లక్ష్యం చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరం సుజల స్రవంతిపై మంత్రి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలవరం ఎడమ కాల్వపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పాత టెండర్లు రద్దు చేసి, కొత్త టెండర్లను పిలుస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సాగు, తాగు నీటికి ఇక కొరత ఉండదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed