ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు : అవంతి

by  |
ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు : అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా కేంద్రం ఇవ్వాల్సిందే అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పురోగతికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని అని పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగకపోతే ప్రత్యేక రాయలసీమ… ఉత్తరాంధ్ర ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ ఎంతో ముందుచూపుతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన అభివృద్ధి ఆగదని విమర్శించారు.



Next Story

Most Viewed