టీడీపీ కనుమరుగు కావడం ఖాయం: మంత్రి అవంతి

by  |
టీడీపీ కనుమరుగు కావడం ఖాయం: మంత్రి అవంతి
X

దిశ, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ మత రాజకీయాల చేస్తున్నందున కనుమరుగు కావడం ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో టీడీపీకి డిపాజిట్‌లు కూడా దక్కవన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 40దేవాలయాలను పడగొట్టిన చంద్రబాబుకు దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మతానికి రాజకీయం పులుముతున్నారని విమర్శించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమన్న మంత్రి అవంతి శ్రీనివాస్.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగుతుందని పేర్కొన్నారు.


Next Story

Most Viewed