అన్ని గ్రామాల్లో ఇళ్ల పంపిణీ : అవంతి

by  |
అన్ని గ్రామాల్లో ఇళ్ల పంపిణీ : అవంతి
X

దిశ, విశాఖపట్నం: విశాఖ నగర పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ టిడ్కో ఇళ్లు కేటాయించాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రేటర్‌ విశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జోనల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విశాఖ నగర పరిధిలోని 3.5లక్షల ఇళ్లు దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2.5లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, మిగిలిన లక్షమందికి కూడా వారి అవసరాలను గుర్తించి త్వరితగతిన ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు అర్హులైన వారందరకీ సకాలంలో ఇళ్లు అందించాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల రెండో తేది వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పండగ అన్ని గ్రామాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, గ్రేటర్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed