బాపూ మ్యూజియంలో అరుదైన వస్తువులు -అవంతి 

by  |
బాపూ మ్యూజియంలో అరుదైన వస్తువులు -అవంతి 
X

దిశ వెబ్ డెస్క్: విజయవాడ బాపు మ్యూజియంను బుధవారం ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. రూ.11 కోట్లతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాపు మ్యూజియంలో శిలా సంపద చాలా‌ ఉందన్నారు. అత్యంత అరుదుగా దొరికే ప్రాచీన వస్తువులను మనం ఇక్కడ చూడవచ్చన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలు మన పెద్దలు మనకిచ్చిన సంపద అని తెలిపారు. రాబోయే తరాలకి ఈ ప్రాచీన సంపదను అందించడం మన బాధ్యత అని సూచించారు. మ్యూజియంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ వస్తే ప్రతి ఒక్కరూ బాపు మ్యూజియంను సందర్శించేలా దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Next Story

Most Viewed