మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు :అవంతి

by  |
మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు :అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: రామతీర్థం ఘటన దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాముడి విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్ష ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం జరిగిందని.. వాటిని చేధిస్తామని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిని చంద్రబాబు మానుకోవాలని సూచించారు. ఇతర దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు.. రామతీర్థం ఆలయాన్ని ఎందుకు సందర్శించారని అవంతి శ్రీనివాసరావు అడిగారు.

తన సొంత జిల్లాలో ఉన్న తిరుమలకు వెళ్లి చంద్రబాబు ఒక్క సారి అయిన వెళ్లి తలనీలాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ, జనసేనకు దేవుళ్లపై ఎంత భక్తి ఉందో తమకు అంతే భక్తి ఉందన్నారు. బీజేపీ, జనసేనకు రాష్ట్రంపై అభిమానం ఉంటే విభజన హామీలను అమలుకు కృషి చేయాలన్నారు. తమ పార్టీపై క్రిస్టియన్ ముద్ర వేయాలని చూస్తున్నారని.. వైసీపీలో 90 శాతానికి పైగా హిందువులు ఉన్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Next Story

Most Viewed