స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం : మంత్రి అవంతి

by  |
Minister Avanthi Srinivas
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల నేతలతో చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కచ్చితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం, దీనిపై అసెంబ్లీలో తీర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఎంపీలు పోరాడుతారని, గల్లీలోనూ.. ఢిల్లీలోనూ పోరాడి ప్రధానిపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామని తెలిపారు.


Next Story

Most Viewed