నిరూపిస్తే కూల్చివేతకు నేను సిద్ధం : మంత్రి

by  |
నిరూపిస్తే కూల్చివేతకు నేను సిద్ధం : మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై మంత్రి అప్పలరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. తూముకొండ, సూదికొండపై ఆక్రమణలు జరిగాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. నిరూపిస్తే కూల్చివేతకు తాను సిద్ధం అని అప్పలరాజు స్పష్టం చేశారు. కూల్చివేతలు మొదలుపెడితే మొదట గౌతు లచ్ఛన్న ఘాట్‌నే తొలగించాలని అన్నారు. గౌతు లచ్ఛన్న ఘాట్ దేవాదాయ భూముల్లో నిర్మించారని సూచించారు. ఈ విషయం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు తెలియకపోవడం బాధాకరం అని విమర్శించారు. ఆ రెండు కొండలను టీడీపీ హయాంలోనే కొల్లగొట్టారని వెల్లడించారు.

Next Story

Most Viewed