- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు విషయంలో దేవినేని ఉమ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అంతేగాకుండా ‘మేం ఏదో ఆడుతుంటే… నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా?’ అని సంచలన కామెంట్లు చేశారు. మా మంత్రి కొడాలి నాని చెప్పినట్టు నువ్వు నిజంగా ఉమక్కే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, కేంద్రం నుంచి సకాలంలో నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుదే అని వెల్లడించారు. సకాలంలో నిధులు విడుదల తీసుకొస్తే… వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.