అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

by  |
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అల్లోల దంపతులకు.. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చర్చించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, ఈవో వినోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


Next Story